హొసపేటె: నగరంలో ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా నివారించడానికి నగరసభ శనివారం ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. ప్రజలలో ఇంతగా అవగాహన పెరగడంతో నగరంలోని రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త వేయడాన్ని నివారించే ఉద్దేశ్యంతో చెత్త కుప్పలను గుర్తించి, వాటిపై రంగోలీ వేయాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. దీనిలో భాగంగా నగరంలోని 10వ వార్డులో అత్యంత తరచుగా చెత్తను పారవేసే ప్రదేశాలను గుర్తించి, మున్సిపల్ పర్యావరణ అధికారులు, కమ్యూనిటీ మొబిలైజర్ల నాయకత్వంలో 10వ వార్డు పరిధిలోని జీటీ.కాంపౌడ్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు రంగోలి చిత్రాలు గీసి, టైరుతో ఒక బొమ్మను తయారు చేసి, దానిని చెత్త పారచేసే ప్రదేశంలో ఉంచి, పరిశుభ్రత గురించి, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదనే విషయంపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలు రోహిణి వెంకటేష్, మున్సిపల్ కౌన్సిల్ పర్యావరణ ఇంజనీర్ ఆర్తి, పర్యావరణ ఇన్స్పెక్టర్ విరుపాక్షి, మేసీ్త్ర రమేష్ వర్మ, 10వ వార్డు కమ్యూనిటి మొబైల్ ఆపరేటర్ లక్ష్మి, గంగమ్మ వార్డుకు చెందిన వెంకమ్మ హేమావతి, శశికళ, శారద, అశ్విని, అంజిని, జాఫర్ తాజ్, ఇతర వార్డుల కమ్యూనిటీ మొబైల్ ఆపరేటర్లతో పాటు పౌర కార్మికులు హాజరయ్యారు.


