వచ్చే వారంలో పెళ్లి.. అంతలోనే జవాను మృతి | - | Sakshi
Sakshi News home page

వచ్చే వారంలో పెళ్లి.. అంతలోనే జవాను మృతి

Jun 11 2023 12:24 AM | Updated on Jun 11 2023 8:25 AM

- - Sakshi

కర్ణాటక: కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జవాను అర్ధంతరంగా తనువు చాలించాడు. రైలు దిగుతూ జారి పడి జవాన్‌ మృతి చెందిన ఘటన బెళగావిలో జరిగింది. గోకాక్‌ తాలూకా కనసగేరి గ్రామానికి చెందిన కాశీనాథ్‌ శింధిగార(28) ఎనిమిది సంవత్సరాలుగా ఆర్మీలో పని చేస్తున్నారు. వచ్చే వారంలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు.

సెలవు పెట్టి పంజాబ్‌ నుంచి రైల్లో బెళగావికి చేరుకున్నాడు. రైలు దిగుతుండగా కాలు జారి కింద పడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కొడుకుగా చూడాల్సిన తమ కుమారున్ని విగతజీవిగా చూడాల్సి వచ్చిందని తల్లిదండ్రులు రోదించడం అందరినీ కలచివేసింది. కాగా జవాన్‌ మృతి చెందినట్లు తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement