సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన నిధుల వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక (పీఎస్), ప్రాథమికోన్నత (యూపీఎస్), ఉన్నత పాఠశాలలు (హెచ్ఎస్), కేజీబీవీ/ మోడల్ స్కూళ్లు, జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు/కేంద్రాల విభాగాల్లోని 2,205 విద్యాసంస్థలకు సంబంధించి నిర్వహణ నిధులు విడుదలయ్యాయి. పాఠశాలల్లో మైనర్ రిపేర్లకు, తాగునీటి సదుపాయాలు, ల్యాబ్లు, లైబ్రరీల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం ఈ గ్రాంట్ను కేటాయించారు. విద్యార్థుల సంఖ్య (స్లాబ్లు) ఆధారంగా హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, డీఈవోల స్పర్మ్ అకౌంట్లలో ఈ నిధులు నేరుగా జమ కానున్నాయి. కాగా, ఇందులో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు, పీఎంశ్రీ పాఠశాలలకు ఈ గ్రాంట్ వర్తించదు.


