న్యూస్రీల్
కాడెడ్లు పోయి.. పాడి ఆవు వచ్చింది
ఎల్నినో సాగురంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతోంది. అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. వర్షాల్లేక పని లేకుండా పోయింది. రైతులు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు. కొందరు పాడి పరిశ్రమను ఆశ్రయిస్తూ ఆవులు, గేదెలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత జీవన పోరాటంలో ఇవి తప్పడం లేదని రామడుగు మండలం షానగర్కు చెందిన రైతు సైనాల లక్ష్మయ్య తెలిపాడు. తనకున్న కాడెడ్లను అమ్మి ఒక పాలిచ్చే ఆవును కొనుగోలు చేశానని, పంటలపై నమ్మకం లేదని, పాల వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


