మాచారెడ్డి: స్నేహానికి కులం,మతం, హద్దులు ఉండవు. దాన్ని అక్షరాల నిజం చేస్తున్నారు మాచారెడ్డి మండల వీడియో, ఫొటో గ్రాఫర్లు. గత ఆరేళ్లుగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్నందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరేళ్ల కింద మృతి చెందిన ఘన్పూర్ గ్రామానికి చెందిన ఫొటో గ్రాఫర్ సల్ల రమేష్ కుటుంబానికి రూ 54వేలు,ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందిన గజ్యానాయక్ తండా చౌరస్తాకు నాగరాజు కుటుంబానికి రూ2.44 లక్షలు, అలాగే లచ్చాపేటకు చెందిన అజయ్ కుటుంబానికి రూ 74వేలు అందజేశారు. అంతే కాకుండా మృతుల కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ఆడ పిల్లలకు రూ. 10 వేలు ఇస్తున్నామని ఫొటో గ్రాఫర్లు తెలిపారు.


