భూసమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూసమస్యలను పరిష్కరించాలి

May 1 2025 12:28 AM | Updated on May 1 2025 12:28 AM

భూసమస్యలను పరిష్కరించాలి

భూసమస్యలను పరిష్కరించాలి

సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌

కామారెడ్డి క్రైం: రెవెన్యూ సదస్సుల దృష్టికి వచ్చిన ప్రతి భూసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సూచించారు. భూభారతి చట్టంపై పైలెట్‌ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న రాష్ట్రం లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. లింగంపేట్‌ తహసీల్‌ కార్యాలయం నుంచి కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ కమిషనర్‌ మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలులో భాగంగా ముందస్తుగా నాలుగు పైలెట్‌ మండలాలను ఎంపిక చేసుకొని, రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. సదస్సుల్లో భాగంగా భూసమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.

వీసీలో భాగంగా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. లింగంపేట్‌ మండలంలో ఉన్న 23 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, దాదాపు 3,700 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సర్వే నంబర్‌ సమస్యలు, విస్తీర్ణ సమస్యలు, సాదా బైనామా లాంటి పలు రకాల భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని కమిషనర్‌కు వివరించారు. భూభారతి చట్టం నిబంధనల ప్రకా రం దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్‌ వి విక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్‌, ప్రత్యేకాధికారి రాజేందర్‌, తహసీల్దార్‌ సురేశ్‌, భూ కొలతల సహా య సంచాలకులు ఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement