తక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తా. మొక్క మొలిచిన వారం రోజుల నుంచే పురుగులు, తెగుళ్లు వస్తాయి. పురుగు కనబడిన వెంటనే మందులు వాడం. కానీ ఎక్కువగా నష్టం చేయడంతో పిచికారీ చేయడం తప్పడం లేదు. ప్రతీ పంటపై కనీసం 4–5 సార్లు పిచికారీ చేయనిదే పంట పండే పరిస్థితి లేదు. – కొలగాని రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాలరూరల్
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలి. పురుగుమందును శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు మాత్రమే వాడాలి. ఒకే భూమిలో కాకుండా పంటను మార్పిడి చేయాలి. పంటను మార్కెట్కు తీసుకవచ్చే ముందు ఎట్టి పరిస్థితుల్లో పురుగుమందులు పిచికారీ చేయొద్దు.
– కట్ట లత, జిల్లా ఉద్యానశాఖాధికారి


