నాడు మిలమిల..
పట్టణ సుందరీకరణలో
భాగంగా రెండేళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధుల నుంచి సుమారు రూ.30లక్షలు వెచ్చించి జయశంకర్ విగ్రహం నుంచి బస్ డిపో, కొత్త బస్టాండు మీదుగా యావర్రోడ్డు డివైడర్ల మధ్య.. కొత్త బస్టాండ్ నుంచి మంచినీళ్ల బావి వరకు సెంట్రల్ లైటింగ్ పోల్స్కు కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మొదట్లో జిగేల్ మంటూ మెరిసిన లైట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. బల్దియా అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన లైట్లు రెండేళ్లకే వెలగకపోవడంతో ప్రజల సొమ్ము రోడ్ల పాలు అయిందంటూ పట్టణ వాసులు విమర్శిస్తున్నారు.
– జగిత్యాలటౌన్


