వానాకాలం సీజన్లో మంచి రేటు వస్తుందని ఎకరం బీర సాగు చేస్తున్న. కాత దశకు చేరుకుంటున్న తరుణంలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. నీరు తోటలో నిలిచి పూత రాలిపోయింది. మొక్కలు పసుపు పచ్చగా మారాయి. దాదాపు రూ.50వేల వరకు నష్టం వాటిల్లింది.
– మెక్కోండ రాంరెడ్డి, అలూరు, రాయికల్ మం
నీరు నిల్వతోనే ఇబ్బంది
కూరగాయల పంటలు ఎక్కువగా నీటిని తట్టుకోవు. రెండు, మూడు రోజులు నీరు నిల్వ ఉంటే భూమి నుంచి ఆహారాన్ని తీసుకోక మొక్కలు వడలిపోయి, చనిపోతాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతోనే కూరగాయల పంటలకు ఇబ్బంది కలిగింది.
– కట్ట లత, ఉద్యాన శాఖాధికారి, జగిత్యాల


