WHO: రెమ్‌డెసివర్‌ను కరోనా చికిత్సకు వాడొద్దు

WHO Says Remdesivir Injection Removing From Covid Treatment  - Sakshi

జెనీవా: కరోనా చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది. అందుకే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇక భారత్‌లోనూ కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని.. కరోనా బాధితులెవరికి ఆ ఇంజక్షన్‌ వాడొద్దని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశంలో, పలు రాష్ట్రాల్లో  రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తుంది.  
చదవండి: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్‌ తీసుకోవద్దు 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top