ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్‌ సందేహం | US President Donald Trump Raised Questions on Washington Plane Crash | Sakshi
Sakshi News home page

ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్‌ సందేహం

Jan 30 2025 12:50 PM | Updated on Jan 30 2025 3:02 PM

US President Donald Trump Raised Questions on Washington Plane Crash

వాషింగ్టన్: వాషింగ్టన్ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇలా జరగడం మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ ఈ ప్రమాదం ఎలా జరిగింది? అని ట్రంప్‌ ప్రశ్నించారు.

హెలికాప్టర్ విమానం వైపు  ముందుకు ఎలా వెళ్లిగలిగింది? అది పైకి,  కిందకు లేదా మరొక వైపుకు ఎందుకు తిరగలేదు? అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(US President Trump) పలు సందేహాలను వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ సమీపంలో కెనడియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఆ విమానం అమెరికాలోని కాన్సాస్ సిటీ నుంచి వాషింగ్టన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దరిమిలా విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది.

ఆ విమానంలో 60 మంది ఉన్నారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్‌లో ఉన్నారు. వైట్ హౌస్‌(White House)కు విమానాశ్రయం మధ్య దూరం మూడు కిలోమీటర్ల కంటే తక్కువే. ఆ విమానం ఢీకొన్న హెలికాప్టర్ అమెరికా ఆర్మీకి చెందిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్ (H-60). రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందుగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపధ్యంలో రీగన్ జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ వైమానిక సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ), జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) దర్యాప్తు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికాలో విమాన ప్రమాదం.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement