ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లపై టెహ్రాన్ బాంబుల వర్షం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం(జూలై 14) నాడు ఇరాన్లోని సైనిక స్ధావరాలపై అమెరికా మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ నుంచి " పొంచి ఉన్న ముప్పులను" ముందస్తుగానే తిప్పికొట్టేందుకు ఈ అదనపు దాడులు చేసినట్లు ఒక సీనియర్ అమెరికా రక్షణ శాఖ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
జూలై 13న ఇరాన్కు చెందిన తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ స్ధావరాలపై అమెరికా భారీ ఎత్తున దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడులు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే అమెరికా మళ్లీ విరుచుకుపడటం గమనార్హం. మరోవైపు ఇందుకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లలోని సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
కువైట్, బహ్రెయిన్ దేశాల్లో అమెరికా సైన్యానికి సహకరిస్తున్న ఆయుధాలు, సైనిక పరికరాల నిల్వ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. కువైట్లోని కీలకమైన 'అలీ అల్ సలేం' (Ali Al Salem) ఎయిర్ బేస్పై కూడా ఇరాన్ చేసింది. అక్కడ ఉన్న డ్రోన్ లాంచ్ రాంప్ను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది.


