యూఏఈ: దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం దుబాయ్లో జరిగిన ఎయిర్షోలో ప్రదర్శన సందర్భంగా భారత్ తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతిచెందారు.
భారత్ ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ,హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లు సంయుక్తంగా రూపొందించిన ఈ తేజస్ యుద్ధవిమానం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ షోలో కూలింది. యుద్ధ విమానం కూలిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? లేదంటే పైలెట్ తప్పిదమా? అన్నది తెలియాల్సి ఉండగా.. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ మృతి చెందినట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ధృవీకరించింది
రెస్క్యూ ఆపరేషన్లు వెంటనే ప్రారంభమయ్యాయి, ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయబడింది మరియు సందర్శకులను అది కలిగించిన అంతరాయం తర్వాత ప్రదర్శన ప్రాంతానికి తిరిగి రావాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నవంబర్ 17 న ప్రారంభమైన మరియు నవంబర్ 24 వరకు కొనసాగే ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ షోలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షో, 1,500 మందికి పైగా ఎగ్జిబిటర్లను ఒకచోట చేర్చింది.
#WATCH | Dubai | An IAF Tejas fighter aircraft has crashed during the Dubai Air Show; no pilot ejection has been detected so far. This is only the second reported accident involving the Tejas jet. More details awaited. #DubaiAirShow #Tejas #IAF #Breaking pic.twitter.com/04zcckv8xA
— Argus News (@ArgusNews_in) November 21, 2025



