
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్ తీరుపై మండిపడింది.
అయితే ఇజ్రాయెల్ తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను నిలిపివేయాలని, ఈ సంఘర్షణను కొనసాగించడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇరాన్ వైపు నుంచి జరగలేదు. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
అయితే ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ ప్రజలపై తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను ఉదయం నాలుగు గంటలలోపు ఆపితే, ఆ తర్వాత మా ప్రతిస్పందనను కొనసాగించాలన్న ఉద్దేశ్యం తమకు లేదని అని ఆయన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని మిస్టర్ అరఘ్చి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?