నైజీరియా: ముంచెత్తిన వరదలు.. కూలిన డ్యామ్‌.. 111 మంది మృతి | At Least 111 People Dead After Floods Submerge A Market Town In Nigeria, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

నైజీరియా: ముంచెత్తిన వరదలు.. కూలిన డ్యామ్‌.. 111 మంది మృతి

May 30 2025 9:36 PM | Updated on May 31 2025 3:24 PM

At Least 111 People Dead After Floods Submerge A Market Town In Nigeria

అబుజా: నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.  వరదలు కారణంగా 111 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సమీపంలోని డ్యామ్​ కూలిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు.

వరదలు కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు. 88 మంది మరణించగా.. 23 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 111కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement