
అబుజా: నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 111 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సమీపంలోని డ్యామ్ కూలిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు.
వరదలు కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు. 88 మంది మరణించగా.. 23 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 111కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
At least 30 killed after torrential rains triggered flooding chaos in Niger, Mokwa #Nigeria#Africa #Flood #Mokwa #Flashflood #Rain #Climate #Weather #Viral pic.twitter.com/x2dI0JsoE8
— Earth42morrow (@Earth42morrow) May 30, 2025