30 ఏళ్లుగా టాయిలెట్‌ నీటినే తాగారా!

Japn hospital That Accidentally Used Toilet Water As Drinking Water For Nearly Thirty Years - Sakshi

టోక్యో: జపాన్‌లోని ఒక ఆసుపత్రి సిబ్బంది, రోగులు సుమారు 30 ఏళ్లుగా టాయిలెట్‌ నీటినే తాగు నీరుగా ఉపయోగించారట. అబ్బా ఏంటి ఇది ? అది కూడా జపాన్‌లోనా అని ఆశ్యర్యపోకండి. అసలేం జరిగిందంటే జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ ఆసుపత్రి పరిసరాల్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో తవ్వుతుండగా కొన్ని పంపు నీటి పైపులు తప్పుగా ఏర్పాటు చేయబడినట్లు గుర్తించింది.

(చదవండి: వర్క్‌ ఫ్రం హోం: ఎక్స్‌ ట్రా వర్క్‌కి చెక్‌ పెట్టేలా కొత్త చట్టం)

పైగా ఆ తాగునీటి పైపులు  మరుగుదొడ్డికి అనుసంధానం చేసి ఉంది. ఈ ఆసుపత్రి 1993లో ప్రారంభమైనప్పుడు 120 పైపులు నుంచి నాసిరకం నీరు వస్తున్నట్లు అప్పట్లో ఫిర్యాదుల కూడా వచ్చాయి. కానీ ఇప్పుడ విచారిస్తే ఆ టాయిలెట్‌ వాటర్‌ని రోగులు, సిబ్బంది 30 ఏళ్లుగా వినియోగించినట్టు తేలింది. దురదృష్టమేమిటంటే ఆసుపత్రికి సంబంధించిన భవనాలు నిర్మిచాలనుకునే వరకు ఎవ్వరు వీటిని గుర్తించలేకపోయారు.

అయితే ఆ నీటిని తాగినందు వల్ల ఎవ్వరు  అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి రికార్డుల్లో నమోదు కాలేదు. అధునాతన వైద్య సంరక్షణను అందించే విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఇలా జరగడం తమను ఆందోళనకు గురిచేసిందని తనని క్షమించండి అంటూ ఆ ఆసుపత్రి డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ కజుహికో నకటానీ సిబ్బందిని, రోగులను వేడుకున్నారు.

(చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్‌ తయారు చేసే స్థాయికి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top