ఇరాన్‌ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్‌ వెల్లడి | Israel-Iran Conflict Updates: Israel Reveals Of Key Iranian Drone Commander Died In Missile Attack | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ కీలక డ్రోన్ కమాండర్ హతం: ఇజ్రాయెల్‌ వెల్లడి

Jun 21 2025 10:03 AM | Updated on Jun 21 2025 12:15 PM

Israel Reveals of Key Iranian Drone Commander

జెరూసలేం: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం  ఇరుదేశాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ యుద్ధం ఎనిమిదవ రోజుకు చేరింది. మరోవైపు అణు చర్చలను పునరుద్ధరించేందుకు,  ఘర్షణలు మరింత తీవ్రతరం కాకుండా నిరోధించేందుకు యూరోపియన్ దౌత్యవేత్తలు జెనీవాలో సమావేశమైన తరుణంలోనూ ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.

ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. టెహ్రాన్ హైఫా,  బీర్షెబా వద్ద భీకరంగా క్షిపణుల దాడి జరిగిందని, దీనిలో ఇరానియన్ కీలక డ్రోన్ కమాండర్ హతమయ్యాడని పేర్కొంది. మరోవైపు ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ.. ఇరాన్‌లో  ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి  ఇప్పటివరకూ 657 మంది మృతిచెందగా, రెండువేల మందికి పైగా జనం గాయపడ్డారని తెలిపింది. కాగా జెనీవాలో, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈయూ విదేశాంగ విధాన చీఫ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ మంత్రులతో చర్చలు జరిపారు.

యూరోపియన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ‘ఇరాన్.. యూరప్‌తో మాట్లాడటానికి ఇష్టపడటం  లేదని, వారు తమతో మాట్లాడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. యుద్ధ తీవ్రతను తగ్గించడానికి లేదా అమెరికా జోక్యాన్ని  అనుమతించేందుకు రెండు వారాల  గడువు మాత్రమే ఉందని ట్రంప్.. టెహ్రాన్‌(ఇరాన్‌)ను హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ సుదీర్ఘ ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: మహిళలపై నాడు అభ్యంతరకర పోస్టులు.. చిక్కుల్లో ఇరాన్‌ సుప్రీం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement