అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి | Indian-origin student Shreyas Reddy found dead in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Feb 3 2024 5:49 AM | Updated on Feb 3 2024 5:49 AM

Indian-origin student Shreyas Reddy found dead in US - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలో అమెరికాలో చోటుచేసుకున్న నాలుగో ఘటన ఇది. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో లిండ్నెర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో చదువుకుంటున్న శ్రేయస్‌ రెడ్డి బెనిగెరి అనే తెలుగు విద్యార్థి చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.

పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని, అతడి మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం గురువారం తెలిపింది. శ్రేయస్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, సాధ్యమైనంత మేర వారికి సాయం అందజేస్తామని పేర్కొంది. శ్రేయస్‌ రెడ్డి తండ్రి త్వరలోనే అమెరికా రానున్నారని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement