ఇరాన్‌ షిప్‌ సీజ్ చేసిన ఇండియన్ నేవీ | Indian Navy seizes Iranian ship | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ షిప్‌ సీజ్ చేసిన ఇండియన్ నేవీ

Feb 22 2026 2:53 PM | Updated on Feb 22 2026 3:08 PM

Indian Navy seizes Iranian ship

భారత సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఇరానియన్ షిప్‌ను భారత నావికాదళ అధికారులు పట్టుకున్నారు. అనంతరం దానిని సీజ్ చేసి అందులో ఉన్న నలుగురు ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇరానియన్ షిప్‌లో పెద్దమెుత్తంలో విదేశీ సిగరెట్లు భారత్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల ఇరాన్‌కు సంబంధించిన మూడు చమురు నౌకలను అరేబియా మహాసముద్రంలో భారత నావీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరువక ముందే ఆ దేశానికి చెందిన మరో క్రూజ్‌ను ఇండియన్ నేవీ అధికారులు పట్టుకున్నారు. అరేబియా మహాసముద్రంలోని ద్వారాకా కోస్ట్‌ వద్ద భద్రతా తనిఖీలు నిర్వహించగా నేవీ అధికారులు అనుమానాస్పదంగా ఒక నౌక వెళ్లడం గమనించారు. దీంతో వెంటనే దానిని పట్టుకొని తనిఖీలు నిర్వహించారు

దానిలో పెద్దఎత్తున విదేశీ సిగరెట్ల ప్యాకెట్లు గుర్తించారు. దాదాపు 200 కాటన్ల వరకూ సిగరెట్ల కాటన్స్ సీజ్ చేశారు. వాటిలో లక్ష వరకూ సిగరెట్‌ ప్యాకెట్స్ ఉన్నట్లు తెలిపారు. ఇండియామార్కెట్లో వాటి విలువ దాదాపు రూ. 5 కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో నలుగురు ఇరానియన్ దేశస్థులు ఉండగా వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆ షిప్‌ పేరు ఏఐ ముక్తర్‌గా తెలిపారు.

అయితే ఫిబ్రవరి 16న గుజరాత్ ఐసీజీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరిపిన దాడులలో 200 కిలోల నిషేదిత మదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. కాగా  ఫిబ్రవరి 6న ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు. వాటి పేర్లు స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్జియాగా తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement