శత్రు జలాంతర్గాముల పనిపట్టే ‘మచిలీపట్నం’  | Navy launches ASW shallow watercraft Machilipatnam at Cochin shipyard | Sakshi
Sakshi News home page

శత్రు జలాంతర్గాముల పనిపట్టే ‘మచిలీపట్నం’ 

Jul 30 2026 5:57 AM | Updated on Jul 30 2026 5:57 AM

Navy launches ASW shallow watercraft Machilipatnam at Cochin shipyard

న్యూఢిల్లీ: భారత తీర ప్రాంతాల దాకా దూసుకొచ్చిన శత్రు జలాంతర్గాముల జాడ కనిపెట్టి వాటిపై దాడి చేసే సత్తా ఉన్న మహీ శ్రేణి ‘మచిలీపట్నం’ నౌకను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా జలప్రవేశం చేయించింది.

 కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఎనిమిదవ యాంటీ–సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌క్రాఫ్ట్‌ను నావికాదళంలో చేర్చారు. ఈ నౌకలో జలాంతర్గాములను విధ్వంసంచేసే ఆయుధ వ్యవస్థలు, జలాంతర్గత నిఘా వ్యవస్థలు, సముద్రపాతరలను గుర్తించే వ్యవస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం తీర పట్టణ ఘన చరిత్రను స్మరిస్తూ కొత్త నౌకకు ‘మచిలీపట్నం’ అని నామకరణం చేసినట్లు రక్షణశాఖ తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement