
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్రెడ్డి బీజేపీలో చేరనున్నారా? అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. ఇప్పటికే బీజేపీకి చెందిన కొంత మంది పెద్దలు ఆయన్ను సంప్రదించినట్లు తెలిసింది. ఇందుకు ఆయన సుముఖతను వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయన్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.