
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 13 విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించగా, ప్రతాప్నగర్లో సాయినాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీపీసీసీ కార్యదర్శి పి.విజయారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు సతీష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
