యోగశాస్త్రానికి మన దేశం పుట్టినిల్లు. దాదాపు ఐదువేల ఏళ్ల కిందట యోగా మన దేశంలోనే మొదలైంది. కాలక్రమంలో ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకూ విస్తరించింది. మన పురాణాలు పరమశివుడిని ఆదియోగిగా అభివర్ణిస్తాయి. యోగశాస్త్రానికి పతంజలి మహర్షి తొలి గురువు. యోగశాస్త్రంలో అష్టాంగ మార్గాన్ని బోధించిన పతంజలి మహర్షి, 196 సూత్రాలను గ్రంథస్థం చేశాడు. ఇప్పటికీ యోగ సాధకులకు పతంజలి సూత్రాలే మార్గదర్శకాలు. ఆధునిక ప్రపంచంలో యోగా పురోగతిపై గణాంకాల్లో సమాచారం...

భారత్ సహా దాదాపు అరడజను దేశాలలోని యూనివర్సిటీలు యోగాలో వివిధ స్థాయులకు చెందిన కోర్సులు నిర్వహిస్తున్నాయి. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలలోని కొన్ని యూనివర్సిటీలు యోగాలో ప్రత్యేక కోర్సులు, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలలో యోగా శిక్షణ కేంద్రాలను ప్రైవేటు నిర్వాహకులే నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ కేంద్రాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మన దేశం రెండో స్థానానికి పరిమితమైంది.


