
జోగ్ అందాలు అదరహో
ఆహ్లాదకరంగా ఆగుంబె
నయనమనోహరంగా కొడుగు
బనశంకరి: వర్షాకాలంలో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పర్వతాలు, అడవులు పచ్చదనంతో అలరారుతున్నాయి. భారీ వర్షాలతో జలపాతాలు పాలనురగలా పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. ప్రకృతి అందాలను వర్షాకాలంలో వీక్షించేందుకు రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
ఆగుంబె....
భారతదేశంలో అత్యధిక వర్షం లేదా తేమతో కూడిన ప్రదేశాల్లో ఒకటి మలెనాడులోని ఆగుంబె. దట్టమైన అడవితో కూడిన పర్వతప్రాంతంలో ఆగుంబె అందాలను వర్షకాలంలో వీక్షిస్తే అ అనుభూతే వేరు. ఈ కారణంతో ఆగుంబెను దక్షిణభారతదేశ చిరపుంజీ అని పిలుస్తారు. సొగసైన జలపాతాలు, సూర్యాస్తమయ నయన మనోహరదృశ్యాలు వీక్షించవచ్చు.
జోగ్జలపాతం...
వర్షాకాలంలో పర్యాటకులు భారీ ఎత్తున సందర్శించే స్థలాల్లో జోగ్జలపాతం ఒకటి. వర్షాకాలంలో జోగ్జలపాతం నయమనోహర దృశ్యాలు చూపరులను కనువిందుచేస్తాయి. 830 అడుగులు ఎత్తునుంచి నీరు జాలువారుతుండగా ఏర్పడే పొగ మంచులో జోగ్ అందాలను వీక్షించడం మధురానుభూతిని మిగుల్చుతుంది. జోగ్జలపాతం నాలుగు విభిన్నభాగాలుగా జాలువారుతుంది. కర్ణాటక వాసులే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు.
కొడగు...
భారత్ స్కాట్ల్యాండగ్గా పిలిచే కొడగు లేదా కూర్గ్ కర్ణాటక ప్రకృతిరమణీయ ప్రదేశాల్లో ఒకటి. ఇది హనీమూన్, కుటుంబపర్యటన, ట్రెక్కింగ్కు సరైన పర్యాటక స్థలం. కూర్గ్ వర్షాకాలం సమయంలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీపై ఇష్టం ఉండేవారు అందమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇరుప్పుజలపాతం, కాపీ తోటలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.
సకలేశపుర...
కర్ణాటకలో అత్యంత సొగసైన పర్వతప్రాంతాల్లో సకలేశపుర ఒకటి. సకలేశపుర హిల్స్టేషన్గా గుర్తింపుపొందింది. వర్షాకాలం సమయంలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడ పురాతన సకలేశ్వరస్వామి ఆలయం ఉంది. ట్రెక్కింగ్కు అనుకూలం, మంజేహళ్లిజలపాతం, బిస్లే ఘాట్పాయింట్, మంజరాబాద్ కోట ఆకట్టుకుంటాయి.
చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ఉత్తరకన్నడ జిల్లా పశ్చిమమకనుమల్లో ఒకటైన దాండేలి ప్రకృతి ప్రేమికులను, సాహసికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ సాహసక్రీడలైన ర్యాప్టింగ్, వన్యజీవులు వీక్షణ, వైట్ రివర్రాప్టింగ్ లాంటి జలక్రీడలతో సందడిచే యవచ్చు. దాండేలి వన్యజీవి అభయారణ్యం, కవలేగుహలు, సిందేరిరాక్, సాతోడి జలపాతం తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
కుదురేముఖ్...
చిక్మగళూరు జిల్లాలో కుదురేముఖ్ పశ్చిమకనుమల్లో ఒక సుందరమైన పట్టణం. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు పచ్చని లోయలు, ట్రెక్కింగ్ ప్రదేశాలను వీక్షించవచ్చు. కుదురేముఖ్లో కాపీ ఎస్టేట్లు వర్షాకాలంలో అద్భుతంగా ఉంటాయి. కుదురేముఖ్ నేషనల్ పార్కు, మాన్సున్ ట్రెక్కింగ్తో పాటు అనేక పర్యాటకప్రాంతాలను వీక్షిస్తూ సందడిచేయవచ్చు.
ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్కు చేదు అనుభవం, వీడియో వైరల్