ప్రకృతి నియమాలకు లొంగని ఒక అద్భుతం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అంతుచిక్కని రహస్యం..! శతాబ్దాలుగా ఎలాంటి చమురు.. అంటే నూనె లేదు..! వత్తి లేదు..! కానీ, నిరంతరాయంగా అగ్ని జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యం కూడా.. ఆ జ్వాలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించి.. నిరంతరాయంగా నీళ్లు పోసినా.. ఆరని ఆ జ్వాల వెనక ఉన్న మర్మమేంటి? హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా లోయలో కొలువైన జ్వాలాజీ ఆలయంలో వింతలు, విశేషాలు తెలుసుకుందాం..
భూగర్భంలో ఉండే మీథేన్ గ్యాస్ వల్ల ఈ మంటలు వస్తున్నాయని భావించి, ఓఎన్జీసీ (ONGC) శాస్త్రవేత్తలు ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. కానీ ఆశ్చర్యకరంగా... ఇక్కడ ఎలాంటి గ్యాస్ నిల్వలు లేవని తేలింది! ఆ గ్యాస్ ఎక్కడి నుండి వస్తోంది? అసలు ఇంధనం లేకుండా మంటలు ఎలా వెలుగుతున్నాయి? అన్నది నేటికీ సైన్స్కు అందని ఒక ఛేదించలేని రహస్యం. సైన్స్ సరిహద్దులు ముగిసేచోట ఆధ్యాత్మికత మొదలవుతుందనడానికి జ్వాలాజీ ఆలయమే ఒక సజీవ సాక్ష్యం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..


