
ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 సందర్భంగా కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ పెట్ ఇండియా జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జెండా ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో చోటుదక్కించుకుంది. రీసైకిల్డ్ మెటీరియల్ వినూత్న ఆవిష్కరణ కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకుంది.
ఈ మేరకు కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా మాట్లాడుతూ.."ఈ ఆవిష్కరణకు సహకరించిన ‘గో రివైజ్’, ఐసీసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రీసైక్లింగ్ వ్యర్థాలను విలువైన వనరులుగా ఎలా మార్చవచ్చో చెప్పేందుకు ఈ జెండా నిదర్శనం. ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు అనేది మా పురురోగతని పునరుద్ఘాటించేలా గర్వపడే క్షణం". అని అన్నారు.
ఇక గో రివైజ్ వ్యవస్థాపకుడు యష్ శర్మ ఇది పర్యావరణ బాధ్యతపై శక్తిమంతమైన స్ప్రుహని అందిస్తోంది. కాగా, కోకాకోలా ఇండియా మైదాన్ సాఫ్ ప్రచారంలో భాగంగా ఈ జెండాను ఇలా వినూత్నంగా రూపొందించారు. దీన్ని 11వేల పోస్ట్-కన్స్యూమర్ PET బాటిళ్లతో రూపొందించారు. ఈ జెండాని భారత్లో ఆడే ప్రతి ప్రపంచకప్ మ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలో సగర్వంగా ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు.
అంతేగాదు అక్టోబర్ 5, 2023 ప్రారంభమైన ఈ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్.. నవంబర్ 19 వరకు మొత్తం 19 స్టేడియంలలో సుమారు వెయ్యిమందికి పైగా వాలంటీర్లు రీసైకిల్డ్ పెట్ బాటిళ్లతో తయారు చేసిన సేఫ్టి జాకెట్లను ధరించి, ప్రేక్షకులకు స్టేడియంను క్లీన్గా చూసుకోవడంపై అవగాహన కల్పించడం విశేషం.
(చదవండి: ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్..! ఎవ్వరైనా ఫిదా అవ్సాల్సిందే)