
‘ఆద్యకళ’ పేరిట ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు గత కొన్నేళ్లుగా వివిధకేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పురావస్తు ప్రదర్శనలు విశేష ఆదరణ పొందు తున్నాయి. జానపద పరిశోధకుడిగా ఆయన దశాబ్దాలుగా సేకరిస్తూ, ప్రద ర్శిస్తున్న వేలాది ఆదివాసీ కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాద్యాలు, లోహ ప్రతిమలు, సాంస్కృతిక చిహ్నాలు వెలకట్టలేనివి. అయితే వీటిసంరక్షణ తన శక్తికి మించిన పని అవుతోందనీ, వాటి కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనీ తిరుమలరావు ఎంతో కాలంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిలో కొన్నింటి భద్రత, ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కొంత స్థలాన్ని కేటాయించింది. అదేవిధంగా ఉస్మా నియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న అధ్యాప కుల నివాస స్థలాల్లో రెండు గృహాలను ఈ పురా వస్తు సంరక్షణ, ప్రదర్శన, భద్రత కోసం అధికారికంగా అప్పగించారు.
అయితే ఆ నివాసాలు శిథిలావస్థలో ఉన్నందున వాటికి ప్రభుత్వం మరమ్మతు పనులు చేయిస్తుండగా విద్యార్థి సంఘాలకు చెందినవారు ‘ప్రయివేటు వ్యక్తులకు ప్రొఫెసర్ క్వార్టర్లు కేటాయించడం కుదరదు. తక్కువ రెంటుతో లబ్ధి పొందుతున్నారు’ అని అభ్యంతరం చెబుతూ నిర్మాణ సామగ్రిని కూలదోసి, చిందరవందర చేశా’రని తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఇదే విశ్వవిద్యాలయంలో చాలా కాలం పని చేసినవారే. ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు ఎవరితోనైనా చేతులు కలిపి పని చేసేందుకు తాను సిద్ధమే అనేది ఆయన ప్రతిపాదన.
రెండేళ్ల క్రితం పురాతత్త్వ ప్రదర్శనశాల వారి ఆహ్వానంపై తిరుమల రావు ప్యారిస్ వెళ్లారు. అప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల ప్రతి నిధులు వాటిలో కొన్నింటిని తమ మ్యూజియాలలో భద్రపరుస్తామని ముందుకు వచ్చారు. అయితే ఇది భారతదేశ సంపద అని వారి ప్రతిపాదనను ఆయన ఒప్పుకోలేదు. గత ఏడాది ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలో వీటికి గౌరవం దక్కింది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది! కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ చాలా కాలంగా తిరుమలరావుకు బాసటగా నిలబడి, ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకై ప్రభుత్వాలకు ఎన్నో వినతులను సమ ర్పించారు. చివరకు ప్రదర్శనశాల ఒక కొలిక్కి వస్తున్న దశలో అశని పాతంలా వచ్చి పడిన ఈ విద్యార్థి సంఘాల వారి బెదిరింపు ఖండనార్హం.
– బద్రి నర్సన్