మాతృత్వం.. ఓ మధురానుభూతి! | 15 Years Anniversary Celebrations of Oasis Fertility | Sakshi
Sakshi News home page

మాతృత్వం.. ఓ మధురానుభూతి!

Nov 21 2024 7:41 AM | Updated on Nov 21 2024 7:41 AM

15 Years Anniversary Celebrations of Oasis Fertility

పిల్లల్ని కనడం, పెంచడం, భారం అనుకోవద్దు..  

పనితో పాటు కుటుంబాన్ని 

బ్యాలెన్స్‌ చేసుకున్నాం: నటి రమ్యకృష్ణ  

సాక్షి, హైదరాబాద్‌: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్‌ చేసుకున్నామని తెలిపారు. 

నగరంలోని ఓ హోటల్‌లో ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్‌కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు. 

జపాన్‌లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్‌ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement