
ధాన్యం లారీ బోల్తా
ఉంగుటూరు: కాకర్లమూడి నుంచి ధాన్యం బస్తాల లోడుతో వెళుతున్న లారీ శుక్రవారం రాత్రి గ్రామాన్ని ఆనుకుని ఉన్న చెరువులోకి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీలో ఉన్న ధాన్యం బస్తాలు మొత్తం తడిచిపోయాయి. సుమారు 5 లక్షలు విలువైన ధాన్యం తడిచిపోయినట్లు గుర్తించి కై కలూరు ఉప్పడు మిల్లుకు తరలించినట్లు డీటీ పూర్ణచంద్రప్రసాదు తెలిపారు. ట్రాక్ షీటు జనరేటర్ అయినందున పూర్తి బాధ్యత రైస్మిల్లర్దే అవుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు.