సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య

Published Wed, Jan 31 2024 11:08 AM

Young Woman Suicide In Meerpet - Sakshi

హైదరాబాద్: మీర్‌పేట్ టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్‌లో పనిచేస్తున్న దివ్య అనే యువతి  (18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.  గత కొంత కాలంగా  ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం.

మంగళవారం  2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను లైంగిక దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement