పెళ్లికి ముందే ప్రేమ.. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకథ.. చివరికి!

Woman Kills Husband With Help Of Lover Thiruvallur - Sakshi

సాక్షి, చెన్నై:  ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టుకథ అల్లినా మామ ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా ఆర్కే పేట మండలం చంద్రవిలాసపురం సమీపంలోని సుందర్రాజుపురానికి చెందిన ఆరుముగం కుమారుడు యువరాజ్‌ (29) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు గాయత్రి(25)తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో యువరాజ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గాయత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే మృతిపై అనుమానంతో యువరా జ్‌ తండ్రి ఆరుముగం ఆర్కేపేట పోలీసులకు ఫిర్యా దు చేశారు. సీఐ అన్నాదురై విచారణ చేపట్టారు. గాయత్రి పొంతనలేని సమాధానం చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం వెలుగు చూసింది.   

అడ్డు తొలగించుకునేందుకే.. 
గాయత్రి చెన్నైలోని ప్రైవేటు కళాశాలలో డిప్లమా నర్సింగ్‌ చదువుతుండగా అదే కళాశాలలో పనిచేస్తున్న తిరుత్తణి ఆగూరుకు చెందిన శ్రీనివాసన్‌ (28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే కళాశాల చదువు పూర్తికావడంతో గాయత్రికి యువరాజ్‌తో వివాహం చేశారు. అయితే  ఏడాది కిందట తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేరిన గాయత్రికి అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసన్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

భార్య  ప్రవర్తనపై అనుమానం రావడంతో ఉద్యోగానికి సైతం నిలిపివేశారు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువరాజ్‌ను గాయత్రి, ఆమె ప్రియుడు శ్రీనివాసన్, అతని స్నేహితులు మణిగండన్‌(26), హేమంత్‌ అలియాస్‌ జిల్లు(23) గొంతు నులుమి హత్య చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను డీఎస్పీ విఘ్నేష్‌ ఆధ్వర్యంలో బృందం అదుపులోకి తీసుకుంది. వారిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top