టీచర్‌ సులోచన మృతికి కారణాలు ఏంటి? | Teacher Suspicious death In Karnataka | Sakshi
Sakshi News home page

టీచర్‌ సులోచన మృతికి కారణాలు ఏంటి?

Mar 10 2022 6:57 PM | Updated on Mar 10 2022 7:00 PM

Teacher Suspicious death In Karnataka - Sakshi

కర్ణాటక (మైసూరు) : హిందీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నంజనగూడు పట్టణంలోని మహదేశ్వర లేఔట్‌లో నివాసం ఉంటున్న సులోచన(45) నంజనగూడు తాలూకా మహాదేవనగరలోని మొరార్జీదేశాయి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త సురేష్‌ కొన్ని సంవత్సరాలక్రితం మృతి చెందాడు.  ఇద్దరు పిల్లతో కలిసి నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి  తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నంజనగూడు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement