టీచర్ సులోచన మృతికి కారణాలు ఏంటి?
కర్ణాటక (మైసూరు) : హిందీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నంజనగూడు పట్టణంలోని మహదేశ్వర లేఔట్లో నివాసం ఉంటున్న సులోచన(45) నంజనగూడు తాలూకా మహాదేవనగరలోని మొరార్జీదేశాయి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త సురేష్ కొన్ని సంవత్సరాలక్రితం మృతి చెందాడు. ఇద్దరు పిల్లతో కలిసి నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నంజనగూడు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.