సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు.. ఇద్దరిపై కేసు

Social Media Posting Issue In Hyderabad - Sakshi

సాక్షి, ఉప్పల్‌(హైదరాబాద్‌): మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన ఇద్దరిపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇద్దరి పోస్టింగ్‌లపై పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేసి­నట్లు తెలిపారు.

కాలు సింగ్‌ హిందీలో, మహ్మద్‌ కలీం ఉర్దులో పోస్టింగ్‌లు పెట్టడంతో ఇద్దరూ విద్వేశాలు రెచ్చగొట్టడంతోపాటు లా అండ్‌ ఆడర్‌ సమస్య తలెత్తే విధంగా ఉన్నాయని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్‌ పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top