HYD: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి | RTC Bus And Bike Accident At Hyderabad's Chandanagar | Sakshi
Sakshi News home page

HYD: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

Jul 24 2024 9:29 AM | Updated on Jul 24 2024 9:38 AM

RTC Bus And Bike Accident At Hyderabad's Chandanagar

సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం చందానగర్‌ టీజీఎస్‌ఆర్టీసీ ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. కాగా, మృతులను చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే, మదీనాగుడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై మనోజ్, రాజులు వెళుతున్నారు. చందానగర్‌ జీఎస్ఎం మాల్ సమీపంలో యుటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళుతూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టారు. బైక్‌ నడుపుతున్న మనోజ్‌తో పాటు వెనకాల కూర్చున్న రాజు కూడా అక్కడిక్కడే చనిపోయాడు. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement