రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం

Ongole: Seized Liquor Bottles Worth Rs 2 Crore Crushed Under Road Roller - Sakshi

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్‌ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లు, ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్‌: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top