88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..

Seized Liquor Bottles Crushed Under Road Roller In Rayachoti - Sakshi

రూ.92 లక్షల విలువ చేసే అక్రమ మద్యం ధ్వంసం

రెండేళ్లలో  17 పోలీస్‌స్టేషన్లలో 472 కేసులు

రాయచోటిటౌన్‌: అక్రమ మద్యంపై పోలీస్‌ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.  గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. 

అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని  తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్‌స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్‌ అధికారులు, ఎక్సైజ్‌ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్‌: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top