మహిళను చెరబట్టాడు.. కుమార్తెపై కన్నేశాడు 

A man who tortures both mother and daughter - Sakshi

తల్లీ కుమార్తెలను చిత్రహింసలకు గురి చేస్తున్న కామాంధుడు 

మంగళగిరి: భర్త వదిలేసిన మహిళను చెరబట్టడమే కాక ఆమె కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాలని తల్లీ కుమార్తెలను చిత్రహింసలకు గురిచేస్తున్న కామాంధుడి ఉదంతమిది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు పోలీసులకు తెలిపిన వివరాలు.. మంగళగిరికి చెందిన గోలి సాంబశివరావు కొన్నేళ్లుగా భర్త వదిలేసిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉండగా.. తల్లితోనే ఉంటోంది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి పెళ్లి చేసేందుకు తల్లి ప్రయత్నాలు చేస్తుండగా.. 

ఆమెపైనా కన్నేసిన సాంబశివరావు అడ్డుకుంటున్నాడు. చిన్నతనం నుంచీ తన తల్లితో ఉంటున్న సాంబశివరావును ఆ యువతి తండ్రిగానే పిలుస్తోంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనను కూడా పెళ్లి చేసుకుంటాననడంతో ఆ యువతి తట్టుకోలేక ఎదురుతిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాంబశివరావు తల్లీ కుమార్తెలను వారం రోజులుగా ఇంట్లోనే ఉంచి చిత్రహింసలు పెట్టాడు. బుధవారం ఆ యువతిని బెల్ట్‌తో చితకబాదడంతో తట్టుకోలేకపోయిన తల్లీ కుమార్తెలు ఇంటి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top