కిరాతకం: అందరూ చూస్తుండగానే.. | Man Assassinated Friend In Karnataka | Sakshi
Sakshi News home page

ఎంత చెప్పినా వినలే.. చూస్తుండగానే స్నేహితుడిని నరికేశాడు

Apr 14 2021 6:41 AM | Updated on Apr 14 2021 9:16 AM

Man Assassinated Friend In Karnataka - Sakshi

ఘటనా స్థలంలో మంజు మృతదేహం, కొడవలితో నిందితుడు వెంకటేష్‌

జిల్లాలోని తిపటూరులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో స్నేహితున్ని అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. కొందరు ఈ వైనాన్ని మొబైళ్లలో బంధించారు

తుమకూరు: జిల్లాలోని తిపటూరులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో స్నేహితున్ని అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. కొందరు ఈ వైనాన్ని మొబైళ్లలో బంధించారు. ఈ ఘోరం సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణంలోని తమిళ కాలనీకి చెందిన వెంకటేష్‌(45), మంజు(28) పెయింటర్లుగా పనిచేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. వీరిద్దరూ  సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు.

ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అంతే.. వెంకటేశ్‌  కొడవలి తీసుకొని హల్‌చల్‌ చేశాడు. స్థానికులు వెళ్లి సర్దిచెప్పినా వినకుండా మంజుపై దాడి చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మంజును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ అక్కడ లేరు. ఈ ఘోరం ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
చదవండి:
ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో..
హాస్టల్‌లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement