చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది..

Exam Pressure: CBSE Student Commits Suicide In Hyderabad - Sakshi

సాక్షి,  మియాపూర్‌(హైదరాబాద్‌): చక్కగా చదువుకోలేకపోతున్నాననే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవికుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దయాళ్‌పూర్‌నకు చెందిన వీరేంద్రసింగ్‌ నేగి, సోనియా నేగి దంపతులకు కుమార్తె జాహ్నవి నేగి (17), కుమారుడు ఉన్నారు. వీరు మియాపూర్‌ మైహోమ్స్‌లో టార్క్‌ ఐఎస్‌ బ్లాక్‌లో 9వ అంతస్తులో జీవనం కొనసాగిస్తున్నారు. జాహ్నవి ప్రస్తుతం సీబీఎస్‌ఈ 12వ తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు వాకింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 9వ అంతస్తు నుంచి కిందకి దూకింది. గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జాహ్నవి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. చదువులో మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. చాటింగ్‌లో మునిగితేలారు.. చివరకు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top