
అంబర్పేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లేష్ కథనం మేరకు.. గోల్నాక తులసీరామ్నగర్ లంకలో నివసించే 2020 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ ఎం.శ్రీకాంత్(28) ఈ నెల 16న రాత్రి 11.30 సమయంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. గోల్నాక నల్లపోచమ్మ ఆలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి ఓ పదిహేనేళ్ల మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి శ్రీకాంత్ వాహనాన్ని ఢీకొట్టాడు.
గాయపడ్డ శ్రీకాంత్ను చికిత్స నిమిత్తం మలక్పేట యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పడంతో అతని తల్లి, భార్య అవయవ దానానికి ముందుకు వచ్చారు. శ్రీకాంత్కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం అతడి భార్య గర్భవతి. పోలీసులు మైనర్ బాలుడిని కోర్టులో హాజరు పరిచి జువైనల్ హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్)