మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు! | 91 children and girls were molested and assassinated within four months | Sakshi
Sakshi News home page

మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు!

Nov 7 2024 5:21 AM | Updated on Nov 7 2024 5:21 AM

91 children and girls were molested and assassinated within four months

రాష్ట్రంలో అంతులేని అఘాయిత్యాల పర్వం

నాలుగు నెలల్లోనే 91 మంది చిన్నారులు, బాలికలపై అత్యాచారాలు

వారిలో ఏడుగురి హత్య

చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచార ఘటనలు

 రెడ్‌బుక్‌ సేవలో పోలీసు యంత్రాంగం

సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమ­కోస­మేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్త­కాల బ్యాగు భు­జా­న వేసుకుని తుళ్లింతలతో స్కూల్‌కు వెళ్లే బాలి­క­లపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడు­తు­న్నాయి. భవి­ష్యత్‌పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘా­­యిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలి­­­కల ఆర్తనాదాలు అరణ్య రోద­నగా మారు­తు­న్నాయి. కూట­మి సర్కారు చేతగాని­తనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి సెల్యూట్‌ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.

నంద్యాల జిల్లా ముచ్చు­మర్రిలో కామ పిశా­­చాలు ఓ చిన్నా­రిని అపహరించి హత్యాచారానికి తెVý­ ­బడ్డా ఈ ప్రభు­త్వా­నికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడి­చినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలే­కపో­యా­మనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగి­స్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యా­చారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయి­త్యా­నికి పాల్పడ్డారు. 

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నియో­జకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూ­హిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యా­చా­రాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.

ఆగని అత్యాచారకాండ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు  విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవా­సం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యా­లకు పాల్పడుతు­న్నాయి. 

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచా­రాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.

పోలీసుల అస్త్ర సన్యాసం
బాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అన­ంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కా­ణం. పుట్లూరు మండలం అరకటివే­ము­లలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలై­లో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఉన్న ఐషర్‌ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారా­నికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. 

తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తు­న్నారు. ‘ముఖ్య’­నేత ఆదే­శించినట్టుగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అరా­చ­కాలకు కొమ్ముకా­యడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అప­హరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.

బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీ­సులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణా­లతో కాపాడగ­లిగే­వారు. యథా చేతగాని ప్రభు­త్వం..తథా చేష్ట­లు­డిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement