నారావారిపల్లి దళిత ఎంపీటీసీ సభ్యుడికి అవమానం | Dalit MPTC Member Humiliated in Naravaripalle | Sakshi
Sakshi News home page

నారావారిపల్లి దళిత ఎంపీటీసీ సభ్యుడికి అవమానం

Aug 16 2026 9:10 AM | Updated on Aug 16 2026 9:10 AM

Dalit MPTC Member Humiliated in Naravaripalle

ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగిన ఎంపీటీసీ సభ్యుడు రాజయ్య

చంద్రగిరి: సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చెందిన దళిత ఎంపీటీసీ సభ్యుడిని అధికారులు తీవ్రంగా అవమానించారు. ఆయనకు సమాచారం ఇవ్వకుండానే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లి (కందులవారిపల్లి)కి చెందిన రాజయ్య గత ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా విజ­యం సాధించారు. శనివారం స్వాతంత్య్ర దినో­­త్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. 

అయితే ఎంపీటీసీ సభ్యుడు రాజయ్యకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తనకు జరిగిన అవమానంపై రాజ­య్య శనివారం చంద్రగిరిలోని ఎంపీడీవో కార్యాలయ ప్రవేశ మార్గంలో బైఠాయించి నిరసన చేపట్టారు. ‘దళిత ఎంపీటీసీ సభ్యులంటే మీకు గౌర­వం లేదా’ అని ఎంపీడీవో చంద్రికను నిలదీశా­రు. సీఎం చంద్రబాబు సొంత పంచాయతీకి తాను ఎంపీటీసీ సభ్యు­డిగా ప్రాతి­నిథ్యం వహించడం నేరమా? అని వాపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement