సాక్షి, నంద్యాల: శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను తరలించే యత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.


