‘భళా భారత్‌’.. జపాన్‌ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం | World Needs Indian Leadership Says Japanese Ceo | Sakshi
Sakshi News home page

‘భళా భారత్‌’.. జపాన్‌ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం

May 12 2024 7:57 AM | Updated on May 12 2024 8:35 AM

World Needs Indian Leadership Says Japanese Ceo

భారత్‌ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్‌ టెక్‌ కంపెనీ కోఫౌండర్‌ ఫిదా అయ్యారు. భారత్‌ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్‌, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్‌లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి  సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.

ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా 
ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్‌ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు.   
  
ఆశ్చర్యపోయా
‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు..  
వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని ఉదహరించారు. భారత్‌ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. 

వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్‌) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్‌ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను కొనియాడుతూ పోస్ట్‌ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్‌పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement