ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు! | Why NRI's Are Getting TAX Notices in India | Sakshi
Sakshi News home page

ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!

Jun 11 2025 11:02 AM | Updated on Jun 11 2025 12:06 PM

Why NRI's Are Getting TAX Notices in India

ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) పన్ను నియమాలు పాటించకపోవడాన్ని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. భారత పన్ను అధికారులు అన్ని ఆర్థిక లావాదేవీలపై నిఘాను గణనీయంగా పెంచారు. అద్దె ఆదాయం నుంచి పాత పొదుపు ఖాతాల వరకు అన్ని అంశాలకు సంబంధించి స్క్రీనింగ్‌ చేసి పన్ను నోటీసులు జారీ చేస్తున్నారు.

నోటీసులకు కొన్ని కారణాలు ఇవి..

ఆదాయపు పన్ను శాఖ డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత ట్రాకింగ్ ద్వారా పన్ను దారులను గుర్తిస్తోంది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్‌ఆర్‌ఐలు ఎలాంటి సందర్భాల్లో పన్ను నోటీసులు అందుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం.

నివేదించని అద్దె ఆదాయం: ఇండియాలో ఆస్తిని కలిగి ఉండి దానిపై అద్దెను ఆదాయం ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంటే మాత్రం చట్ట ప్రకారం పన్ను పరిధిలోకి వస్తారు.

పాత పొదుపు ఖాతాలు: పరిమితికి మించి డిపాజిట్లు ఉన్న నిద్రాణమైన ఎన్ఆర్ఓ ఖాతాలుంటే పన్ను అధికారులు పరిశీలిస్తారు.

అధిక విలువ కలిగిన లావాదేవీలు: పెద్ద మొత్తంలో రెమిటెన్స్‌లు, ఆస్తి అమ్మకాలు లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను తప్పకుండా తెలియజేయాలి. ట్యాక్స్‌ డిక్లరేషన్లను సరిగ్గా దాఖలు చేయకపోతే  చర్యలు తప్పవు.

ఇదీ చదవండి: ఎస్‌పీఎంసీఐఎల్‌కు త్వరలో నవరత్న హోదా!

మూలధన లాభాలు: భారతదేశంలో స్థిరాస్తి లేదా ఈక్విటీలను విక్రయించడం.. ఇక్కడి డబ్బును విదేశాలకు బదిలీ చేసినా పన్నులు వర్తిస్తాయి.

వ్యాపార ఆదాయం: దేశీయ ఆధారిత వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఎన్ఆర్ఐలు ఆదాయపు పన్ను నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

విదేశీ ఆదాయాన్ని బహిర్గతం చేయకపోవడం: భారతీయ పన్ను చట్టాల ప్రకారం కొన్నిసార్లు ఎన్‌ఆర్‌ఐలు తమ మొత్తం ఆదాయాన్ని బహిర్గతం చేయవలసి ఉంటుంది. ఇది పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement