
వాల్మార్ట్ ‘వృద్ధి’ ప్రోగ్రాం లక్ష్యం
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత్లో మరిన్ని చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎంఎస్ఎంఈ) కలిసి పని చేసే ప్రణాళికల్లో ఉంది. తమ ‘వృద్ధి’ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్లో తమ సరఫరా వ్యవస్థలో మరో లక్ష ఎంఎస్ఎంఈలను భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం చిన్న సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ (ఐ2ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వాల్మార్ట్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ ఫ్రెమ్స్టాడ్ తెలిపారు.
ఇప్పటికే ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ మార్కెట్ప్లేస్ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధి ప్రోగ్రాం ద్వారా కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఎంఎస్ఎంఈలకు అవసరమయ్యే నైపుణ్యాల్లో వాల్మార్ట్ మార్గదర్శకత్వం వహిస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 70,000 ఎంఎస్ఎంఈలకు శిక్షణనిచ్చినట్లు ఫ్రెమ్స్టాడ్ వివరించారు.
ఇదీ చదవండి: ‘రేర్ ఎర్త్’ రీసైక్లింగ్పై రూ.100 కోట్ల పెట్టుబడులు
వృద్ధి ప్రోగ్రాం విజయవంతం కావడంతో మెక్సికో, అమెరికాలో కూడా వాల్మార్ట్ ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గత 25 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న వాల్మార్ట్ రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆహారోత్పత్తులు, ఫార్మా, సైకిళ్లు మొదలైనవి కొనుగోలు చేసింది.