వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Stock Market updates On december 23 | Sakshi
Sakshi News home page

వరుస నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Dec 23 2024 3:59 PM | Updated on Dec 23 2024 3:59 PM

Stock Market updates On december 23

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మార్కెట్‌ నుంచి భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల సరళిని గమనించాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్‌ పని చేయదు! కారణం..

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. జొమాటో, మారుతీసుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, నెస్లే కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement