దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై వెంటనే పుంజుకున్నాయి. ఈరోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 16.20 పాయింట్లు ఎగబాకి 23,925 వద్దకు 24,119.10 చేరింది. సెన్సెక్స్(Sensex) 35.18 పాయింట్లు పెరిగి 77,129.25 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ట్రెంట్ , శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.21 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ లాభాల్లో కొనసాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


