సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన సూచీలు | Stock Market Rally Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన సూచీలు

Jan 2 2024 9:53 AM | Updated on Jan 2 2024 9:56 AM

Stock Market Rally Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 21,716 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు దిగజారి 72,141 వద్ద ట్రేడవుతోంది. 

కొత్త సంవత్సరం నేపథ్యంలో యూఎస్‌, యూరప్‌ మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 2023 డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.64 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.855 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.410 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్దకు చేరింది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement