
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ సూచీలు రయ్మంటూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల సాంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రోజున మంచి జోరు మీద ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9:31 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1085.50 పాయింట్లు లాభపడి 55,741.95 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 311.35 పాయింట్లు లాభపడి 16,657.55 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
టాటా మోటార్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాటా మోటార్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఓఎన్జిసి, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్ , జెఎస్డబ్ల్యు స్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!